ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 19, 2024, 07:42 PM

కర్నూలు జిల్లా ప్రజలు తనకు దేవుళ్లాంటివాళ్లని.. వదిలి వెళ్లాలంటే తట్టుకోలేపోతున్నానన్నారు టీడీపీ డోన్ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి. కోడుమూరు తనదైనప్పటికీ కర్నూలు వదిలివెళ్లడం ఎంతో బాధగా ఉందని.. జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలు తనను కట్టిపడేస్తున్నాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. కోడుమూరులో నిర్వహించిన తెలుగు దేశం పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన కర్నూలు ఎంపీ, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి హాజరయ్యారు.


కర్నూలు పార్లమెంటు నుంచి తాను పోటీ చేయకపోవడంతో 14 లక్షల మంది ఓటర్లు చింతిస్తున్నారన్నారు కోట్ల. ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గ ప్రజలను వదిలిపెట్టి వెళ్లాలంటే తట్టుకోలేపోతున్నానంటూ కంటతడి పెట్టారు. కోట్లను అలా చూసి అక్కడ ఉన్న అభిమానులు సైతం కన్నీరు పెట్టారు. కురబ వర్గీయులు కూడా పైకి రావాలనేది తన కోరికని.. ఈ విషయం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పానన్నారు. అందుకనే బీసీలు ఎదగాలనే తాను డోన్‌కు వెళ్లానన్నారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చాను కాబట్టి గత్యంతరం లేక వెళ్లానన్నారు. డోన్‌లో పోటీ చేయడం ఇష్టం లేదని సూర్యప్రకాష్ రెడ్డి పరోక్షంగా చెప్పారు. పార్టీలో వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగాపోతే తప్పకుండా టీడీపీ గెలుస్తుందని అన్నారు.


టీడీపీ గెలవాలి కాబట్టి అభిమానులంతా కలిసి కట్టుగా పని చేసి కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరిని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. తప్పకుండగా టీడీపీ అధికారంలోకి వస్తుందని.. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక రైతు బిడ్డగా రైతులకు ఇచ్చిన హామీలను తప్పకుండగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. టీడీపీని గెలిపిస్తే తాను ఎక్కడున్నా గుండ్రేవుల, ఎల్లెల్సీ, వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూస్తానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com