ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోలలపూడిలో వివాహిత అనుమానాస్పద మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 10:56 AM

మార్టూరు మండలం కోలలపూడి గ్రామంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మంగళవారం ఉదయమే ఫిర్యాదు అందగా మార్టూరు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాల కారణంగా గాలి మరియమ్మ(27) అనే వివాహిత సోమవారం సాయంత్రం తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సమాచారం అందుకున్న ఆమె తల్లి జండ్రాజుపల్లి సమాధానం కుమార్తె మృతదేహాన్ని పరిశీలించి ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా ఎస్సై రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త అత్తమామలే తన కుమార్తెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సమాధానం చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com