ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రాంతానికి బ్రిడ్జ్ అత్యవసరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 11:56 AM

ఎంతో ఆవసరత కలిగిన రహదారి నుంచి నెల్లూరు ప్రవేశానికి ప్రధాన ద్వారం వద్ద బ్రిడ్జి నిర్మాణాన్ని జాప్యం చేస్తూ, ఇప్పటికీ లేదు అని తప్పించుకుంటున్న వైసీపీ MLA ల అసమర్ధతను నిరసిస్తూ,మెడికవర్ హాస్పిటల్ జంక్షన్ వద్ద బాక్స్ టైపు బ్రిడ్జి ఆవశ్యకతను తెలియజేస్తూ జనసేన నాయకులూ  నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి మాట్లాడుతూ... వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రాంతానికి బ్రిడ్జ్ అత్యవసరం. అహైవే నుంచి నెల్లూరు కి ప్రధాన ద్వారంగా ఉన్న ఈ హైవే చిల్డ్రన్స్ పార్క్ జంక్షన్లో బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటి దాకా మీ హయాం లో మరియూ ఇప్పటి నుండి పోయే ప్రాణాలను బలిగొన్న ఉసురు మీకు తగులుతుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి తెప్పించుకోలేక పోయిన MLA లు. ఇప్పటికైనా ఈ సెంటర్లో అవసరమైన బ్రిడ్జి నిర్మాణం ఆవశ్యకతను తెలుసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం.


ప్రజల బాధ్యత మరచిన ఈ వైసీపీ నాయకులకు తమ జవాబుదారీతనాన్ని గుర్తుచేస్తూ ఈ రోజు జనసేన పార్టీ తరఫున మెడికవర్ బ్రిడ్జి జంక్షన్ వద్ద బ్రిడ్జి టైపు బాక్స్ టైపు బ్రిడ్జి నిర్మించాలంటూ జనసేన నిరసన తెలియజేస్తున్నాం అని నిరసనలు తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com