దుర్గగుడి పరిసర ప్రాంతాలను హోంమంత్రి తానేటి వనిత గురువారం పరిశీలించారు. దేవీ నవరాత్రులలో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పున్నమి ఘాట్, పార్కింగ్ ఏరియా, సానిటేషన్, క్యూ లైన్, ఇతర వసతి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. దుర్గా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.