తమిళనాడులో 400 సంవత్సరాల నాటి అరుదైన మహిళ విగ్రహాన్ని పోలీస్ ఐడల్ వింగ్ టీమ్ స్వాధీనం చేసుకుంది. దీని విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కొనుగోలుదారులమంటూ నిందితులను నమ్మబలికి పోలీసులు వారిని ట్రాప్ చేశారు. బేరసారాలు జరపిన అనంతరం ఇన్ఫర్మేషన్ నిజమని నిర్ధారించుకొని వారిని అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.