ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడేళ్ల తరువాత వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గుర్తుకొస్తున్నారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 01:14 PM

పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం ములకలూరు గ్రామంలో, నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు ,  గ్రామ నాయకులు ఆధ్వర్యంలో బాదుడే బాదుడే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరై గ్రామంలో తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ...  మూడేళ్లగా వైసీపీ ఎమ్మెల్యే  గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడున్నారో తెలియదు, ఇప్పుడు గడపగడపకు అంటు వస్తున్నారు. ఇది ప్రజల పై ప్రేమతో కాదు, భవిష్యత్తులో టికెట్ ఉండదేమో అనే భయంతో వస్తున్నారు. గడప గడప కాస్త గొడవ గొడవగా మారింది. ఒక గడప తొక్కి నాలుగు గడపలు దాటి వెళ్తున్నారు. గ్రామాల్లో ఇంటి స్థలాలు పేరుతో ప్రజల్ని మోసం చేశారు. పింఛన్ దారుల నుంచి చెత్త పన్ను పేరుతో రూ.300 వసూలు చేయటం దారుణం. హామీలు అమలు చేయలేక మాట తప్పి మడమ తిప్పిన జగన్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వైసీపీ ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధి చెబుతారు అని తెలియజేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com