అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోదీ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అహ్మదాబాద్ చేరుకుని సబర్మతీలోని రనిప్ పోలింగ్ కేంద్రం 115 లో ప్రధాని మోదీ ఓటు వేశారు. ఓటు వేసేందుకు ప్రధాని పోలింగ్ కేంద్రం బయట లైనులో నిలబడటం విశేషం. ప్రధాని రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొన్నది. గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఓటు వేయనున్న పోలింగ్ కేంద్రం వద్దకు ప్రజలు భారీగా చేరారు.