అమరావతి: విజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అమలు చేస్తేనే సార్థకత లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు, శాఖాధిపతులతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో మరింత వృద్ధిరేటు సాధించేందుకు ఏం చేయాలన్న అంశాలపై సమాలోచన చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కలెక్టర్ల సదస్సుకు ఇది సన్నాహక సమావేశమన్నారు. ప్రతి త్రైమాసికం తనకొక పరీక్ష అన్నారు. రాయలసీమలో కరవు, ఆంధ్రాలో తుపాన్లు మనకు ఎదురైన సవాళ్లన్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టే సమయంలో మనకు ఎదురైన సవాళ్లవి అని గుర్తు చేశారు.