ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అమలు చేస్తేనే సార్థకత: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2017, 12:14 PM

అమరావతి: విజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అమలు చేస్తేనే సార్థకత లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు, శాఖాధిపతులతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో మరింత వృద్ధిరేటు సాధించేందుకు ఏం చేయాలన్న అంశాలపై సమాలోచన చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కలెక్టర్ల సదస్సుకు ఇది సన్నాహక సమావేశమన్నారు. ప్రతి త్రైమాసికం తనకొక పరీక్ష అన్నారు. రాయలసీమలో కరవు, ఆంధ్రాలో తుపాన్లు మనకు ఎదురైన సవాళ్లన్నారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టే సమయంలో మనకు ఎదురైన సవాళ్లవి అని గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com