ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదో తరగతిలోనే రాజకీయాల్లోకి రావాలనుకున్నా: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2017, 02:16 PM

ఒంగోలు: టెన్త్‌ చదివే రోజుల్లోనే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు జనసేన అధినేత పవన్‌ పేర్కొన్నారు. ఇవాళ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "పార్టీని ఎలా నడిపిస్తాడోనని నాపై కొందరికి సందేహాలున్నాయి" అని అన్నారు. కేవలం సమాజం బాగుండాలనే కాంక్షతో రాజకీయాల్లోకి వచ్చానే తప్ప వేరే ఉద్దేశం లేదని పవన్ స్పష్టం చేశారు.క్రమశిక్షణ, జవాబుదారీతనంతోనే రాజకీయాల్లోకి వచ్చాననీ.. రాజకీయాలంటే ప్రజల్లో భయం పోవాలని ఆయన పేర్కొన్నారు. జవాబుదారీతనం ప్రజలకే కాదు.. ప్రభుత్వానికి కూడా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులకు జవాబుదారీతనం లేకపోతే ప్రజా ఉద్యమాలు పెరుగుతాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com