ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్రిటెక్ సదస్సుతో రైతులకు ఒరిగిందేమీ లేదు: రాఘవులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 19, 2017, 01:00 PM

విశాఖలో జరిగిన అగ్రిటెక్ సదస్సుతో సన్న, చిన్నకారు రైతులకు ఒరిగిందేమీ లేదని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే సదస్సు నిర్వహించారన్నారు. అలాగే స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులకు చట్టరూపం కల్పించాలన్నారు. ఉపాధి కల్పించలేని పారిశ్రామికరణతో ప్రయోజనంలేదని, ఆహార ఉత్పత్తులను పక్కనబెట్టే కుట్ర జరుగుతోందన్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com