ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలుడుని కిడ్నాప్ చేసి దుండగులు చంపేశారు. మార్టూరు మండలం ద్యారకపాడులో మణికంఠ అనే బాలుడిని దుండగులు కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. ఆ తరువాత బాలుడిని చంపేసి గుంటూరు జిల్లా నకిరేకల్లు వద్ద మృతదేహాన్ని వదిలేసి పారిపోయారు. నిందితుడు వీరాంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.