పుణె: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. తొలి సెషన్లో భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఆసీస్ బ్యాట్స్ మెన్.. రెండ సెషన్నూ అలాగే మొదలుపెట్టారు. అయితే 119 పరుగుల దగ్గర స్పిన్నర్ జయంత్ యాదవ్.. షాన్ మార్ష్ (16)ను వెనక్కి పంపాడు. దీంతో 37 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అంతకుముందు ఓపెనర్ డేవిడ్ వార్నర్ (38)ను ఉమేష్ యాదవ్ పెవిలియన్ పంపగా.. మరో ఓపెనర్ రెన్షా (36) రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం అస్ట్రేలియా జట్టు స్కోరు 132/2 క్రీజులో స్మిత్ 23, హడ్స్ కోంబ్ 10 పరుగులతో ఉన్నారు.