మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చంద్రకాంత్ పాటిల్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ప్రధాని మోడీ రోజూ రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని వెల్లడించారు. ఆయన నిద్రపోకుండా ఓ ప్రయోగం చేస్తున్నారని, దేశం కోసం 24 గంటలు పనిచేస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఇటీవల కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు కొల్హాపూర్లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి పాటిల్ ఈ వ్యాఖ్య చేశారు. ప్రధాని మోడీ ప్రతిరోజులు కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ప్రతిరోజూ 22 గంటల పాటు పని చేస్తారని ఆయన పేర్కొన్నారు. నిద్ర పోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు. ప్రధాని ప్రతి నిమిషం దేశం కోసం పరితపిస్తూ పనిచేస్తున్నారని పాటిల్ పేర్కొన్నారు. 24 గంటలూ మెలకువగా ఉండి దేశం కోసం పని చేసేలా నిద్రను అదుపు చేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నారు.