గుంటూరు: బోగస్ రుణాలు ఇచ్చిన ఇద్దరు సహకార బ్యాంక్ మేనేజర్లను సస్పెండ్ చేశారు. ఫిరంగిపురం బ్యాంక్ మేనేజర్ కోటిరెడ్డి, నరసరావుపేట బ్యాంక్ మేనేజర్ బాలకృష్ణ రెడ్డి ని సస్పెండ్ చేశారు. ఫిరంగిపురం సహకార బ్యాంకులో కోటిన్నర రుణాలు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ప్రత్తిపాడు శాఖలో బోగస్ పట్టాదారు పాసు పుస్తకాల రుణాలపై 51 సెక్షన్ దర్యాప్తు చేయాలని కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. సహకార శాఖ గుంటూరు డివిజన్ అధికారి రత్నావతి ని అధికారిగా నియమించినట్లు డి సి వో రాజశేఖర్ తెలిపారు.