ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు సహకార బ్యాంక్ మేనేజర్లు సస్పెండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 04:10 PM

గుంటూరు: బోగస్ రుణాలు ఇచ్చిన ఇద్దరు సహకార బ్యాంక్ మేనేజర్లను సస్పెండ్ చేశారు. ఫిరంగిపురం బ్యాంక్ మేనేజర్ కోటిరెడ్డి, నరసరావుపేట బ్యాంక్ మేనేజర్ బాలకృష్ణ రెడ్డి ని సస్పెండ్ చేశారు. ఫిరంగిపురం సహకార బ్యాంకులో కోటిన్నర రుణాలు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ప్రత్తిపాడు శాఖలో బోగస్ పట్టాదారు పాసు పుస్తకాల రుణాలపై 51 సెక్షన్ దర్యాప్తు చేయాలని కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. సహకార శాఖ గుంటూరు డివిజన్ అధికారి రత్నావతి ని అధికారిగా నియమించినట్లు డి సి వో రాజశేఖర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com