అమరావతి: రాజధాని నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. రాజధాని తుది డిజైన్ల కోసం ఏపీ ప్రభుత్వం బృందం లండన్ వెళ్లింది. ఈ బృందంలో దర్శకుడు రాజమౌళి కూడా ఉన్నారు. మరోవైపు అమరావతిలో వీఐపీ నివాసాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. దర్శకుడు రాజమౌళి, మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు లండన్ వెళ్లారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై లండన్కు చెందిన నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పుడు మంత్రి నారాయణ, డీఆర్డీఏ అధికారులతో పాటు రాజమౌళి కూడా లండన్ వెళ్లారు. ఇప్పటికే నార్మన్ పోస్టర్స్ ప్రతినిధుల బృందానికి రాజమౌళి పలు సూచనలు చేశారు. ఈ బృందం మూడు రోజుల పాటు లండన్లోనే ఉంటుంది. అందరూ కూర్చొని చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు.