ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి పోచారం ఆరోగ్యం నిలకడగా ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 01:10 PM

హైదరాబాద్: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సీఎం కేసీఆర్ వెంట వెళ్లిన మంత్రి ఛాతి నొప్పికి గురైన విషయం తెలిసిందే. తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించగా అపోలో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. అనంతరం వైద్యులు స్పందిస్తూ అలసట వల్ల మంత్రి అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ప్రాథమిక చికిత్స అందించాక డిశ్చార్జి చేశామని తెలిపారు. కాగా మంత్రి తిరుమల నుంచి నేరుగా హైదరాబాద్‌కు బయలుదేరారు. టీటీడీ నిర్వాహకులు మంత్రి వెంట వైద్య బృందాన్ని పంపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com