ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోల్డెన్ బే రిసార్ట్ వ్యవహారంపై ఆధారాలున్నాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 12:54 PM

చెన్నై: గోల్డెన్ బే రిసార్ట్‌లో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను 11 రోజుల పాటు నిర్బంధించినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని చెన్నై న్యాయవాది బాలు పేర్కొన్నారు. తమను నిర్బంధించినట్టు చాలామంది ఫిర్యాదు కూడా చేశారని ఆయన ఆరోపించారు. త్వరలోనే వాటిని కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం పన్నీర్ సెల్వం పోటీపడడంతో వీకే శశికళ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను చెన్నైలోని గోల్డెన్ బే రెస్టారెంటుకు తరలించిన సంగతి తెలిసిందే. కువత్తూర్‌లోని గోల్డెన్ బే రిసార్టులో 100 మందికి పైగా ఎమ్మెల్యేలను బలవంతంగా నిర్బంధించారనీ.. తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ బాలు సహా మరో న్యాయవాది మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com