గోదావరి ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతుందని. కేంద్రం నుండి నిధులు రప్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందారని సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సవతి తల్లి ప్రేమ చూపిస్తుందా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ 54 వేల కోట్లు రాష్ట్రాన్ని సాధించేందుకు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఒప్పించేందుకు అఖిలపక్షాన్ని తీసుకు వెళ్లాలన్నారు కేంద్రంపై తప్పించడానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకువెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే ప్రతిపక్ష పార్టీల లు తాము తమ నేతృత్వంలో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిన్న నందున ప్రభుత్వ గృహాల లబ్ధిదారుల నుండి గ్రామాలలో 5000 పట్టణాల్లో 10000, 15000 వసూలు చేయాలని నిర్ణయించడం సరికాదన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. దుర్గాభవాని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు , నగర కార్యదర్శి నల్ల రామారావు , ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ నల్ల భ్రమరాంబా తదితరులు పాల్గొన్నారు