నంద్యాల: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్నాయి. వ్యక్తిగత వ్యాఖ్యలు చెయ్యొద్దని ఈసీ చెప్తున్నా జగన్ బుద్ధి మారడం లేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఏబీఎన్తో మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. జగన్, ఆయన పార్టీ నేతలు హద్దులు మీరి మాట్లాడుతున్నారని క్రిమినల్ యాటిట్యూడ్తో మాట్లాడుతున్నారన్నారు. నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. సీఎం గురించి జగన్ చేస్తున్న అభ్యంతరకరమైన భాషపై ఈసీ చర్య తీసుకోవాలని కోరారు. నంద్యాల ఉపఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతోందన్నారు.