ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ కంపెనీ వ్యాక్సిన్ తో అరుదైన సమస్య!

international |  Suryaa Desk  | Published : Tue, Jul 13, 2021, 04:21 PM

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించిన సింగిల్‌ డోసు కరోనా టీకా తీసుకున్నవారిలో అరుదుగా నరాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అప్రమత్తం అయింది. టీకాతో పాటుగా ఈ టీకా వినియోగానికి సంబంధించిన అనుమతుల పత్రంలో హెచ్చరికను జారీ చేస్తున్నారు. ఈ దుష్ప్రభావాన్ని గిలియన్-బారే సిండ్రోమ్‌గా పేర్కొంటారని నిపుణులు తెలిపారు.


అమెరికాలో ఇప్పటి వరకు 12.8 మిలియన్ల మందికి ఈ జాన్సన్‌ టీకా ఇచ్చారు. ఇందులోని 100 కేసుల్లో ఈ దుష్ప్రభావం తలెత్తినట్లు ఎఫ్‌డీఏ వెల్లడించింది. వీరిలో 95 శాతం మంది ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడగా ఒకరు మరణించినట్లు తెలిపారు. అయితే ఈ సమస్య అరుదైనది కావడం వల్ల జాన్సన్‌ టీకా వల్ల తలెత్తే సమస్యల కంటే ప్రయోజనాలే అధికమని స్పష్టం చేసింది. టీకా వేసుకోవాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com