ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలు నుంచే గెలుపొందిన అఖిల్ గొగోయ్

national |  Suryaa Desk  | Published : Tue, May 04, 2021, 11:50 AM

రాజకీయ ఖైదీగా ఉన్న అఖిల్ గొగోయ్ అస్సాం రాజకీయాల్లో కొత్త చరిత్ర లిఖించారు. జైలు నుంచే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి అస్సామీగా గొగోయ్ చరిత్రలో నిలవనున్నారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో జాతీయ దర్యాప్తు సంస్థ గొగొయూని 2019 డిసెంబర్ లో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రాజకీయ ఖైదీగా జైలు గొడల్లో మగ్గుతున్నాడు. తాజాగా జరిగిన ఎన్నికల్లో శివసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జైలు నుంచే బహిరంగ లేఖలు రాస్తూ ప్రచారం కొనసాగించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయనకు మద్దతుగా తన 85 ఏళ్ల తల్లి ప్రచారం నిర్వహించారు. దీంతో తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన సురభి రాజ్ కోన్ వారిపై 11,875 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ స్థానంలో గెలుపు కోసం బీజేపీ తీవ్ర కృషి చేసింది. అయినా ప్రజలు గొగోయ్ వైపే మొగ్గు చూపారు. 1977లో జైలు నుంచే లోక్ సభ కు పోటీ చేసిన జార్జి ఫెర్నాండెజ్ 3 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com