డెర్బీ: మహిళల వరల్డ్కప్లో ఇండియా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్కు వర్షం అడ్డు తగిలింది. మ్యాచ్ జరగాల్సిన డెర్బీలో భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ కూడా సాధ్యం కాలేదు. ప్రస్తుతం గ్రౌండ్ అంతా కవర్లు కప్పి ఉంచారు. టాప్ ఫామ్లో ఉన్న మిథాలీసేన. ఆస్ట్రేలియాకు షాకివ్వాలని చూస్తున్నది. ఇప్పటికే ఆరుసార్లు విశ్వవిజేత అయిన ఆసీస్ టీమ్ ఈ మ్యాచ్కు ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నది.