హిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. గురువారం ఓ ప్రైవేటు బస్సు సోలాన్ నుంచి రాంపూర్ వెళ్తుండగా అదుపు తప్పి లోయలోపడిపోయింది. దీంతో 20 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. సిమ్లా- కిన్నౌర్ జాతీయ రహదారి 5పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సంగతి తెలుసుకున్న స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.