నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా- ఎన్పీసీఐ, కొత్త రూల్స్ని అమలు చేస్తోంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ విషయంలో పరిమితిని విధించబోతోంది. ఎన్పీసీఐ రూల్స్ ప్రకారం మొత్తం యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల్లో ఒక యాప్ ద్వారా గరిష్టంగా 30 శాతం వరకు మాత్రమే లావాదేవీల పరిమితిని విధిస్తోంది. ఉదాహరణకు ఒక రోజులో ఒక కోటి యూపీఐ లావాదేవీలు జరుగుతాయనుకుంటే ఒక యాప్ అంటే గూగుల్ పే లేదా ఫోన్పే లాంటి యాప్స్ అందులో 30 శాతం వాటా మాత్రమే పొందగలవు. అంటే 30 లక్షల వరకు మాత్రమే లావాదేవీలు చేయడం సాధ్యం అవుతుంది. మొత్తం యూపీఐ ఎకోసిస్టమ్ను కాపాడటంతో పాటు ఒకే యూపీఐ యాప్ మార్కెట్ లీడర్గా మారకుండా అడ్డుకోవడం ఈ కొత్త రూల్స్ ఉద్దేశం.
అయితే కొత్త నియమనిబంధనలు భవిష్యత్తులో యూజర్లపైనా ప్రభావం చూపిస్తాయి. ఈ కొత్త రూల్స్ 2021 జనవరి 1న అమలులోకి రానున్నాయి. ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తే మార్కెట్ లీడర్స్గా ఉన్న గూగుల్ పే, ఫోన్పే యూజర్లు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వారికి లిమిట్స్ విధించే అవకాశం ఉంది. అంటే రోజూ 5 లావాదేవీలు మాత్రమే అని లిమిట్ పెట్టొచ్చు. లేదా గంటకు ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాలని రూల్ తీసుకురావొచ్చు. లేదా రూ.1,000 కన్నా ఎక్కువ లావాదేవీలను మాత్రమే అనుమతిస్తామని చెప్పొచ్చు. అదే జరిగితే ఎక్కువ లావాదేవీలు జరిపే యూజర్లు వేర్వేరు యూపీఐ యాప్స్ ఉపయోగించాల్సి రావొచ్చు. ఇతర యూపీఐ యాప్స్ చూస్తే ఎంఐ పే, మొబీ క్విక్, సాంసంగ్ పే లాంటి యాప్స్ ఉన్నాయి.