కర్నూలు నగరంలోని ఎస్పీ ఛాంబర్ నందు ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ద్వారా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సచివాలయ ఉద్యోగుల ఉచిత ఆన్ లైన్ కోచింగ్ అభ్యర్థులకు గ్రాండ్ టెస్ట్-3 ప్రశ్న పత్రమును జిల్లా ఎస్పా పక్కిరప్ప విడుదల చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎస్వి మోహన్ రెడ్డి ఉచితంగా కోచింగ్ ఇప్పించడం ఎంతో అభినందనీయం అని అన్నారు. ప్రస్తుతం అన్ని రంగాలలో తీవ్రమైన పోటీ ఉందని, నిషితమైన విశ్లేషణలతో కూడిన చదువు అవసరమని ఆయన అన్నారు.