గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్(92) కారోనా బారినపడ్డారు. రాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో ఆయనకు కారోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో పూర్తి స్థాయి పరీక్షల కోసం ఆయన సీటీ స్కాన్ చేయించడంతో పాటుగా, ఆర్టీ-పీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్స్ పంపించినట్టు వారు వెల్లడించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి కారోనా లక్షణాలు లేవని వెల్లడించారు. అయితే గతంలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ప్రొస్టేట్ క్యాన్సర్ కలిగి ఉన్నాడని, ఇది తమకు ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. ఇటీవల కేశుభాయ్ పటేల్ వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలిందని, వారి నుంచే ఆయనకు కరోనా వచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు.