కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని చిప్పగిరి మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. శనివారం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యా కానుక కిట్లు సరఫరా చేశారు. మండలంలో 1 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదివే 3429 కిట్లు మంజూరయ్యాయని మండల విద్యాధికారి రంగస్వామి తెలిపారు.