హైదరాబాద్: మహా శివరాత్రి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి 320 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు నడిపే ఈ ప్రత్యేక బస్సుల్లో విధించే ఛార్జీలను కూడా వెల్లడించింది. సూపర్ లగ్జరీ - రూ.410, డీలక్స్ - రూ.350, ఎక్స్ప్రెస్ బస్సులకు రూ.310ల చొప్పున వసూలు చేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు వివరించారు.