కరోనా మహమ్మారి సోకి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమరేశ్ దాస్(76) మృతి చెందారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని ఈగ్రా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి దాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దాస్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో చికిత్స నిమిత్తం ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండె, మూత్రపిండాల సమస్యలు తలెత్తాయి. మొత్తానికి సోమవారం ఉదయం ఎమ్మెల్యే దాస్ మృతి చెందారు. ఎమ్మెల్యే మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.