జమ్ముకశ్మీర్ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ను సందర్శించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. మనోజ్ సిన్హా గత శుక్రవారం జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లోని తాజా పరిస్థితులను రాష్ట్రపతికి వివరించారు.