ఏపీ సీఎం జగన్ పరిపాలనలో దూకుడు పెంచారు. నవరత్నాల హామీలో భాగంగా రాష్ట్రంలో ఉచిత బోరు బావుల తవ్వకానికి ఆదేశాలిచ్చారు. వైఎస్సార్ రైతుభరోసా పథకంలో భాగంగా తమకు ఉచిత బోరు కావాలనుకునే రైతులు అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్న రైతులకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే బోరు తవ్విస్తుంది. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు,విధివిధానాలు ఇలా ఉన్నాయి.
అర్హతలు:
- 5 ఎకరాల వరకు భూమి ఉండి ఇప్పటి వరకు బోరు బావి లేని వారు అర్హులు.
- కనీసం 2.5 ఎకరాల భూమి కలిగిన వారు అర్హులు.
- ఇద్దరు,ముగ్గురు రైతులు కలిసి కూడా అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకునే విధానమిది:
- ఏ గ్రామానికి చెందిన రైతులు ఆ గ్రామ సచివాలయంలో ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
- పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ఆన్లైన్లో సమర్పించాలి.
- అప్లికేషన్ పరిశీలించాక అర్హులకు అధికారుల నుంచి అనుమతి లభిస్తుంది.
- ఆ తర్వాత డ్రిల్లింగ్ కాంట్రాక్టర్,భూ పరిశోధకులు వచ్చి ఎక్కడ నీరు ఉందో చెక్ చేస్తారు. నీరు ఉన్న చోట బోరు బావిని వేసి పని పూర్తి చేస్తారు.
- పని పూర్తయిన తర్వాత రైతు నుంచి హమీ తీసుకుంటారు. ఈ ప్రక్రియలో రైతులు ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. రైతులంతా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.