యూకేలో జరిగిన 1999 వన్డే ప్రపంచ కప్ లో సచిన్ టెండూల్కర్ సరిగ్గా ఇదే రోజున అద్భుతమైన, ఎమోషనల్ మ్యాచ్ ఆడాడు. సచిన్ తండ్రి రమేష్ టెండూల్కర్ మే 19న మరణించడంతో, ప్రపంచ కప్ మధ్యలోనే సచిన్ ఇండియాకి వచ్చేసి తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. నిజంగా ఇది సచిన్ కు ఒక మరచిపోని జ్ఞాపకమనే చెప్పాలి. సచిన్ ఆ సమయంలో ఎలా ఏం చేశాడనే విషయం తెలుసుకునే ముందు మీరో విషయం తెలుసుకోవాలి.
భారతదేశపు అత్యంత నమ్మకమైన ఆన్లైన్ రమ్మీ ఫ్లాట్ఫారం, రమ్మీకల్చర్పై అత్యంత ఆకర్షణీయమైన రివార్డులు ఎంజాయ్ చేయండి. ఈ గేమ్ ఇన్ స్టాల్ చేసుకొని లాక్ డౌన్ ను ఎంజాయ్ చేయడమే కాకుండా డబ్బు కూడా సంపాదించుకోండి.
ఈ లింక్ ను ప్రెస్ చేసి ఇప్పుడే గేమ్ ఆడండి.
rummyculture.onelink.me/WTkY/LokalArticle
ప్రపంచకప్ లో అప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇండియాను గట్టెకించడానికి, తన తండ్రి మరణవార్తను దిగమింగుకొని మే 23న కెన్యాతో మ్యాచులో ఆడి సచిన్ ఇరగదీశాడు. సచిన్ తన అద్భుత ఇన్నింగ్స్ ద్వారా 101 బంతుల్లో 140 పరుగులు (16ఫోర్లు, 3సిక్సర్లు) చేసి భారత్ ను గెలిపించాడు. ఈ ఎమోషనల్ మ్యాచ్ ద్వారా క్రికెట్ అంటే తనకెంత ఇష్టమో ప్రపంచానికి చూపించాడు సచిన్. అందుకే సచిన్ క్రికెటర్లకు దేవుడయ్యాడు.