కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రస్తుతం రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ పొడిగించాలని అన్ని రాష్ట్రాల సీఎంలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో శనివారం మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్ డౌన్ పొడిగింపుకే ప్రధాని మోదీ మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. సీఎంలతో సమావేశం తర్వాత ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించి లాక్ డౌన్ పొడిగింపు పై ప్రకటన చేయనున్నారని సమాచారం.