ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలవరపెడుతోంది. తాజాాగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో కరోనా సోకిన మహిళ శుక్రవారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డలు ఇద్దరూ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఎయిమ్స్ లో సీనియర్ రెసిడెంట్ గా పని చేస్తున్న డాక్టర్ భార్య. డాక్టర్ కు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా తేలింది. ఆయన భార్యకు కూడా పరీక్షలు నిర్వహించగా రెండు రోజుల క్రితమే ఆమెకు కూడా కరోనా పాజిటివ్ గా వచ్చింది. భర్త నుంచే ఆమెకు కరోనా సోకింది. దీంతో డాక్టర్లు ఆమెకు అప్పటి నుంచి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆమె పాపకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలిద్దరికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని, వారిద్దరి ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు.