టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. విశాఖపట్నంలో చంద్రబాబు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు విజయనగరంలో ఈ రోజు పర్యటిస్తున్నారు. మార్గం మధ్యలో పెందుర్తి భూ సమీకరణ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని చంద్రబాబు అనుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి పెందుర్తి వరకు ర్యాలీగా వెళ్లాలని టీడీపీ నేతలు భావించారు. అయితే ర్యాలీకి మాత్రం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కొన్ని షరతులతో పలు కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు వెంట 50 మందికి మించి ఉండరాదని నిబంధన విధించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే వ్యవహారించి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.