టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు బయల్దేరారు. అంతకు ముందు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో వైసీపీ లెక్కలు తేల్చుతా అని చంరబాబు అన్నారు. వైజాగ్ బ్రాండ్ ను దెబ్బతీసిన వైసిపిని ప్రశ్నించే అర్హత లేదా మాకు అని అన్నారు. విశాఖ పర్యటనకు వస్తుంటే వీర్రాజు చెరువు వద్ద రోడ్డు తవ్వారు అని చంద్రబాబు అన్నారు. నా ప్రత్యేతనకు ఆంక్షలు పెట్టడం సరి కాదు అని అన్నారు. పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్లు తవ్వుతున్న వారి సంగతి చూడాలని అయన అన్నారు. రోడ్లు తవ్వనా.. ప్రొక్లైనర్లతో అడ్డు పడిన నా పర్యటన ఆపను అని చంద్రబాబు పేర్కొన్నారు.