ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధరన్ ను రాత్రికి రాత్రే బదిలీ చేశారు. ఈశాన్య ఢిల్లీ ఘర్షణలపై జస్టిస్ మురళీధరన్ విచారణ జరుపుతున్నారు. ఢిల్లీ గొడవలపై నిన్న అర్ధరాత్రి కూడా విచారణ జరిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్న న్యాయమూర్తిని బదిలీ చేశారు. జస్టిస్ మురళీధరన్ ను పంజాబ్- హర్యానా హైకోర్టుకు కేంద్రం బదిలీ చేసింది.