విశాఖ కేంద్రంగా ఐటీని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఐటీ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తాం. త్వరలోనే నూతన ఐటీ పాలసీ తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఐటీ అభివృద్ధికే మిలీనియం టవర్స్ కి నిధులు కేటాయించింది. రాజదానికోసమే అని ప్రభుత్వం ఎక్కడైనా ప్రకటించిందా? అని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అయన అన్నారు.