వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలపై ఐటీ దాడులు జరిగాయని... దాన్ని టీడీపీ ఆపాదించడం మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడమే అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై బురద జల్లేందుకే ఐటి దాడులను వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సోదాల్లో రూ.85 లక్షలు పట్టుబడితే రూ.వేలకోట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అక్రమాస్తులపై సీబీఐ కౌంటర్పై వైసీపీ నేతలు స్పందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.