ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పృథ్వీపై సీఎం జగన్ సీరియస్.. వెంటనే క్షమాపణలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 12, 2020, 12:14 PM

వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. గత మూడు రోజులుగా సినినటుడు పోసాని కృష్ణమురళీ, పృథ్వీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇరువురు నేతలు వైసీపీకి చెందిన వారే కావడంతో వైసీపీ సీనియర్ నేతలు సైతం పట్టించుకోలేదు. ఇప్పటికే రాజధాని రైతుల ఆందోళనలు ముఖ్యమంత్రి జగన్ కు తలనోప్పిగా మారాయి. దీనికితోడు పృథ్వీ, పోసానిల మాటల ఇష్యూ జగన్ కు మరో తలనోప్పి అయింది. దీంతో పృథ్వీకి జగన్ కాస్తా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మున్ముందు ఇలాగే జరిగితే ఎస్వీబీసీ చైర్మన్ పోస్టు నుంచి తప్పించాల్సి వస్తుందని ఘాటుగానే హెచ్చిరించారట. దీంతో చేసేది లేక పృథ్వీ రాజధాని రైతులకు క్షమాపణలు చెప్పారు. అలాగే పోసాని కృష్ణమురళీ తనకు సోదరుడి లాంటి వాడని.. అభిప్రాయ భేదాలుంటే పార్టీలో చర్చించుకుంటామని పృథ్వీ చెప్పుకోచ్చారు. అయితే పృథ్వీ క్షమాపణలతో పోసాని సంతృప్తి చెందుతారా..? లేదా అన్నది వేచి చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com