ప్రభుత్వ బ్యాంక్ల విలీనాలను నిరసిస్తూ ప్రభుత్వరంగ బ్యాంక్ల యూనియన్లు ఈ నెల 22న బంద్కు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ)లు బ్యాంక్ల సభ్యులు పాల్గొంటారని తెలిపింది.
కాగా 22న జరిగే బంద్తో తమ బ్యాంక్ బ్రాంచ్లు ప్రభావితం కానున్నాయని బీఓబీ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. ఇండియా మొత్తం మీద బీఓబీకి 9500 బ్రాంచ్లున్నాయి. ఈ బంద్ ఎఫెక్ట్ తక్కువ స్థాయిలోనే ఉంటుందని ఇందులో పాల్గొనేందుకు యూనియన్లలో మెంబర్షిప్ ఉన్న తమ బ్యాంక్ ఎంప్లాయీస్ సంఖ్య తక్కువగా ఉండే అవకాశంవల్ల ఎఫెక్ట్ తక్కువ స్థాయిలో ఉంటుందని ఎస్బీఐ చెప్పింది.