సీలేరు జలవిద్యుత్ కేంద్రం వద్ద గురువారం ఉదయం కంటైనర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. డ్రైవర్, క్లీనర్ పరార్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో ఆవులు గేదెలను కొనుగోలు చేసి కంటైనర్లలో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. శ్రీకాకుళం హైదరాబాద్ జాతీయ రహదారిపై కంటైనర్లలో పశువుల రవాణా చేస్తుంటే టోల్గేట్ల వద్ద పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేస్తుండడంతో.. విశాఖ ఏజెన్సీ జీకేవీధి సీలేరు మీదుగా హైదరాబాద్ తరలించడం ప్రారంభించారు. కంటైనర్ లో 5 గేదెలు చనిపోయాయి. మరో 10 పశువులు చనిపోయే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద ఘటనకు సీలేరు పోలీసులు చేరుకొని ఏపీ జెన్ కో క్రైన్ సహాయంతో.. చనిపోయిన గేదెలు తీస్తున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.