ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత్రికేయుని హ‌త్య‌పై జ‌గ‌న్ సీరియ‌స్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2019, 12:29 AM

తూర్పుగోదావరి: జిల్లాలోని తుని మండలం ఎస్. అన్నవరం గ్రామంలోని లక్ష్మీదేవి చెరువుగట్టుపై కాటా సత్యనారాయణ(45) అనే పాత్రికేయుడిని దండగులు కత్తులతో దాడి చేసి హతమార్చిన  ఘటనని  రాష్ట్ర ప్ర‌భుత‌వం తీవ్రంగా పరిగణించింది. . ఈ కేసును సీరియస్ గా తీసుకుని ముమ్మ‌ర గాలింపుల‌తో నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలంటు రాష్ట్ర డిజిపి కి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. 


ఈమేర‌కు జర్నలిస్ట్ హత్య చాలా దారుణమైన ఘటన అని డిజిపి ఖండన. ఈ కేసును స్వయంగా పర్యవేక్షించి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలంటూ  తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని డీజీపీ ఆదేశించారు.   తక్షణం సంఘటన స్థలంలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలంటూ ఎస్పీని డిజిపి ఆదేశించారు.


 .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com