తూర్పుగోదావరి: జిల్లాలోని తుని మండలం ఎస్. అన్నవరం గ్రామంలోని లక్ష్మీదేవి చెరువుగట్టుపై కాటా సత్యనారాయణ(45) అనే పాత్రికేయుడిని దండగులు కత్తులతో దాడి చేసి హతమార్చిన ఘటనని రాష్ట్ర ప్రభుతవం తీవ్రంగా పరిగణించింది. . ఈ కేసును సీరియస్ గా తీసుకుని ముమ్మర గాలింపులతో నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలంటు రాష్ట్ర డిజిపి కి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు.
ఈమేరకు జర్నలిస్ట్ హత్య చాలా దారుణమైన ఘటన అని డిజిపి ఖండన. ఈ కేసును స్వయంగా పర్యవేక్షించి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలంటూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని డీజీపీ ఆదేశించారు. తక్షణం సంఘటన స్థలంలోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలంటూ ఎస్పీని డిజిపి ఆదేశించారు.
.