రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వెనిజులా మోడల్ తీసుకువచ్చిందని టీడీపీ సీనియర్ నేత యనమల ఆరోపించారు. సర్కార్ టెర్రరిజంతో పారిశ్రామిక వేత్తలు బెదిరిపోతున్నారని, అప్పు ఇస్తే ఎలా తీరుస్తారని ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ బ్యాంకు ప్రశ్నించలేదన్నారు. దళారీ వ్యవస్థను కవర్ చేయడానికి బుగ్గన తాపత్రయ పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ ఆదాయం తప్ప అన్ని రంగాల నుంచి రాబడి తగ్గిపోయిందని విమర్శించారు.