ఏపిలో మీడియా సంస్థల ప్రసారాలు నిలిపివేసిన విధానంపై మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ కు తెలిపినట్టు సమాచారం. శనివారం ఆర్టికల్ 370 రద్దు విషయమై పూర్తి వివరాలు దేశవ్యాప్తంగా వివరించేందుకు నిర్వహిస్తున్న సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ స్వయంగా వేమూరి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సమయంలో కేంద్రమంత్రి వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఉన్నారు. కాగా జగన్ ప్రభుత్వం మీడియా ప్రసారాలు నిలిపివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు పట్ల కేంద్ర మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయంపై కేంద్ర సమాచార ప్రసారాల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపినట్టు సన్నిహిత వర్గాల భోగట్టా.