కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక యాప్ ద్వారా స్వచ్ఛతలో మనమూ భాగస్వాములు కావచ్చు. మీ గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి ఎలా ఉంది?.. మీ పట్టణంలో స్వచ్ఛతకు ఏ ర్యాంకు ఇవ్వవచ్చు?.. మీ ప్రాంతంలో స్వచ్ఛత విషయంలో అధికారుల పనితీరు ఎలా ఉంది?.. ఇలాంటి అంశాలపై ఇక ప్రజలే న్యాయనిర్ణేతలు. వారి అభిప్రాయం మేరకే ర్యాంకు నిర్ధారిస్తారు. ఇందు కోసం ఓ యాప్ రూపొందించి, దానిద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ యాప్ద్వారా నిర్భయంగా మన అభిప్రాయాలు వెల్లడించి పారిశుధ్ధ్యాన్ని మెరుగు చేసుకొనే అవకాశం ఉంది. .
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ నినాదంతో పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. పల్లెల్లో పారిశుధ్ధ్య సమస్యలను ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళుతుంటారు. కాని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి న స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ్ – 2019 సర్వే యాప్ ద్వారా నేరుగా పల్లె, పట్టణ ప్రజలే తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛర్యాంకుల్లో మన జిల్లాస్థానాన్ని నిర్ధారించేందుకు జిల్లా ప్రజలే తమ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. సెప్టెంబర్ 25 తేదీవరకు యాప్ ద్వారా అభిప్రాయం తెలిపే అవకాశం ఉంది.