ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం..ఇక పై ప్రజలే న్యాయనిర్ణేతలు

national |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2019, 02:43 PM

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక యాప్‌ ద్వారా స్వచ్ఛతలో మనమూ భాగస్వాములు కావచ్చు. మీ గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి ఎలా ఉంది?.. మీ పట్టణంలో స్వచ్ఛతకు ఏ ర్యాంకు ఇవ్వవచ్చు?.. మీ ప్రాంతంలో స్వచ్ఛత విషయంలో అధికారుల పనితీరు ఎలా ఉంది?.. ఇలాంటి అంశాలపై ఇక ప్రజలే న్యాయనిర్ణేతలు. వారి అభిప్రాయం మేరకే ర్యాంకు నిర్ధారిస్తారు. ఇందు కోసం ఓ యాప్‌ రూపొందించి, దానిద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ యాప్‌ద్వారా నిర్భయంగా మన అభిప్రాయాలు వెల్లడించి పారిశుధ్ధ్యాన్ని మెరుగు చేసుకొనే అవకాశం ఉంది. .


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్‌ నినాదంతో పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. పల్లెల్లో పారిశుధ్ధ్య సమస్యలను  ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళుతుంటారు. కాని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి న స్వచ్ఛసర్వేక్షణ్‌ గ్రామీణ్‌ – 2019 సర్వే యాప్‌ ద్వారా నేరుగా పల్లె, పట్టణ ప్రజలే తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛర్యాంకుల్లో మన జిల్లాస్థానాన్ని నిర్ధారించేందుకు జిల్లా ప్రజలే తమ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ఈ యాప్‌ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. సెప్టెంబర్‌ 25 తేదీవరకు యాప్‌ ద్వారా అభిప్రాయం తెలిపే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com