ఢిల్లీ: హైకోర్టులో న్యాయాధికారుల నియామకాలపై దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు జులై 11వ తేదీకి వాయిదా వేసింది. జిల్లా స్థాయిలో న్యాయాధికారుల క్యాడర్ ఎంత ఉండాలో ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపులు జరిపి నిర్ణయించుకోవాలని ఏపీ, తెలంగాణలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలపై సూచనలు ఉంటే 4 వారాల్లోగా కేంద్రానికి తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటికి అనుగుణంగా కేంద్రం తుది మార్గదర్శకాలు రూపొందించాలని తెలిపింది. క్యాడర్ నిర్ణయం మేమే తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.