న్యూఢిల్లీ : చిదంబరం అరెస్టును కాంగ్రెస్ ఖండించింది. చిదంబరంంపై సీబీఐ ద్వారా కేంద్రం కక్ష తీర్చుకుంటున్నట్లు కనిపిస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. ఈ రోజిక్కడ రణదీప్ సుర్జేవాలాతో కలిసి విలేకరులతో మాట్లాడిన ఆయన సీబీఐ, ఈడీ కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తున్నదని ఆయన అన్నారు. చిదంబరాన్ని అరెస్టు చేసిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళ మాటల ఆధారంగా.. 40ఏళ్ల నుంచి ప్రజా సేవ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేస్తారా అంటూ మండిపడ్డారు.