ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పగతో కుటుంబం మొత్తాన్ని లేపేసాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2019, 11:26 PM

పాత పగతో ఓ యువకుడు ఓ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో  ఓ కుటుంబ హత్య ఆగష్టు 9 న జరిగింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్‌లోని బర్వానీ ప్రాంతంలో రాయ సింగ్‌ కుటుంబం నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తుండటంతో ఈ నెల 11న ఇంటికి వచ్చిన అతడికి కుటుంబ సభ్యలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అదే సమయంలో ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు గోయి నదిలో లభించాయి.  అదే రోజు సాయంత్రం రాయసింగ్‌ భార్య మృతదేహం మరో ప్రాంతంలో  లభించడంతో కుటుంబ సభ్యు లు హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు గ్రామ ప్రజలను, బంధువులను ప్రశ్నించారు. 


 రాయా సింగ్‌ మేనల్లుడు చిచియా సింగ్‌ (22) పాత కక్షలతో ఆ కుటుంబాన్ని చంపేశానని  దర్యాప్తులో వెల్లదించడంతో పోలీసులు అవాక్కయ్యారు. తన సోదరుడి సహాయంతో రాయాసింగ్‌(45), అతని భార్య, ఇద్దరు కుమారులుతో పాటు రెండేళ్ల కూతురిని హతమార్చి వేర్వేరు  ప్రాంతాల్లో పారేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గతంలో రాయాసింగ్‌ తన అన్నను చంపాడని, అందుకే ప్రతికారంతో తన కుటుంబాన్ని అంతం చేసినట్లు వెల్లడించాడు. నిందితుడితోపాటు అతడి సోదరుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. తాజాగా పోలీసులు రాయాసింగ్‌, అతని కూతురు మృతదేహాన్ని కూడా గుర్తించారు.  


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com