వరదల కారణంగానే తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై డ్రోన్ ఉపయోగించారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. చంద్రబాబు నివాసం మీద డ్రోన్ వివాదంపై డీజీపీ స్పందించారు. లోకల్ పోలీసులకు సమాచారం లేనందున కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందన్నారు. ఇందులో ఎటువంటి కుట్రలేదన్నారు. అలాగే దీన్ని రాజకీయం చేయొద్దని డీజీపీ తెలిపారు. ఇకపై డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని డీజీపీ సూచించారు.